ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN, Publish Date - Jan 28 , 2024 | 11:58 PM

షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లింగారెడ్డిగూడ శివారులో ఉన్న నీటిగుంటలో పడి వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.

షాద్‌నగర్‌ రూరల్‌, జనవరి 28: షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లింగారెడ్డిగూడ శివారులో ఉన్న నీటిగుంటలో పడి వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఎస్సై దేవకి కథనం ప్రకారం.. షాద్‌నగర్‌ పటేల్‌ రోడ్డుకు చెందిన రాసాల శివకుమార్‌(31) పెయింటర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతడికి ఒక కూతురు ఉంది. ఏడేళ్ల క్రితం భార్య విడిచిపెట్టి వెళ్లిపోగా తల్లితో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి లింగారెడ్డి గూడ శివారులో నీటిగుంటలో పడి మృతిచెంది కనిపించాడు. గ్రామస్తుల సమాచారంతో తల్లి అక్కడికి చేరుకుని బోరున విలపించింది. మృతహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్న ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Jan 29 , 2024 | 07:22 AM

Advertising
Advertising