చైనా మాంజాతో వ్యక్తికి గాయాలు
ABN, Publish Date - Jan 17 , 2024 | 11:29 PM
నిషేధిత చైనా మాంజా ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. సంక్రాంతి పర్వదినాన ఎక్కడ చూసినా పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు.
వికారాబాద్, జనవరి 17: నిషేధిత చైనా మాంజా ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. సంక్రాంతి పర్వదినాన ఎక్కడ చూసినా పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పతంగులు ఎగురవేసేందుకు చైనా మాంజా వినియో గిస్తున్నారు. దీంతో అది కాస్త ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా, వికారాబాద్లో ఓ లాడ్జిలో పనిచేసే అమీర్ అనే వ్యక్తి గొంతుకు మాంజా కోసుకుని తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో స్థానికులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రిలో చికిత్స అందించారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సంక్రాంతి పండుగ వేళ చైనా మాంజా విషయంలో మరింత పటిష్టమైన చర్యలు తీసుకుని వాటిని అమ్మకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jan 17 , 2024 | 11:29 PM