యువతి అదృశ్యం
ABN, Publish Date - Jan 05 , 2024 | 11:59 PM
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన శుక్రవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
శంషాబాద్రూరల్, జనవరి 5 : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన శుక్రవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మండల పరిధిలోని శంకరపూరం గ్రామానికి చెందిన కడ్దాల కావేరి ఈ నెల 4న తన కూలి పనికి వెళ్లగానే ఉదయం శంషాబాద్ కూరగాయల మార్కెట్కు వెళ్లింది. సాయంత్రమయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బెల్టు షాపులపై దాడులు
మద్యం బాటిళ్లు స్వాధీనం
శంషాబాద్రూరల్, జనవరి 5 : ననాజీపూర్లోని ఓ కిరాణషా్పలో అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిఽధిలో ఈ ఘటన జరిగింది. ఎస్సై భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. నవాజీపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల మహేందర్ అనే వ్యక్తి మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో తోటి సిబ్బందితో అక్కడి వెళ్లి పరిశీలించగా యాభై వేల రూపాయల విలువైన బీరు బాటిళ్లు, ఫుల్, ఆఫ్, క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసున్నామని ఎస్సై తెలిపారు. పట్టుబడిన మద్యం బాటిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Jan 05 , 2024 | 11:59 PM