Bonda Uma: తక్షణమే విజయసాయిని ఈడీ అదుపులోకి తీసుకోవాలి
ABN, First Publish Date - 2022-11-24T11:46:27+05:30
ఢిల్లీ లిక్కర్ స్కామ్ సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకే తన ఫోన్ పోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకే తన ఫోన్ పోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఫిర్యాదు చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheshwar rao) వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ప్రమేయం ఉన్న 34 మంది రూ.1.20 కోట్లు విలువ చేసే 140 ఫోన్లు మార్చినట్లు ఈడీ తమ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొందని తెలిపారు. ఒక్క శరత్ చంద్రారెడ్డే 30కిపైగా ఫోన్లు మార్చారన్నారు. సాక్ష్యాలు ధ్వసం చేసిన చట్టం కింద తక్షణమే విజయసాయిని కూడా ఈడీ అదుపులోకి తీసుకోవాలని కోరారు. వీరప్పన్ ఇంట్లో గంధపు చెక్కలు ఎవరో దొంగలించినట్లు విజయసాయి ఫోన్ దొంగతనం వ్యవహారం ఉందని యెద్దేవా చేశారు. నిస్సిగ్గుగా దర్యాప్తు సంస్థల్ని చులకన చేసే విధంగా విజయసాయి వ్యవహారం ఉందని బోండా ఉమామహేశ్వరరావు (TDP Leader) విమర్శలు గుప్పించారు.
Updated Date - 2022-11-24T12:03:03+05:30 IST