Oman: కూతురి మరణాన్ని తట్టుకోలేక.. మస్కట్‌లో కామారెడ్డి వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-11-14T11:52:43+05:30

ఉపాధి కోసం ఒమన్‌కు వెళ్లిన తెలంగాణ వ్యక్తి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా, దోమకొండ మండలం, ముత్యంపేట గ్రామానికి చెందిన స్వామి.. కొన్నేళ్ల

Oman: కూతురి మరణాన్ని తట్టుకోలేక.. మస్కట్‌లో కామారెడ్డి వ్యక్తి ఆత్మహత్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉపాధి కోసం ఒమన్‌కు వెళ్లిన తెలంగాణ వ్యక్తి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా, దోమకొండ మండలం, ముత్యంపేట గ్రామానికి చెందిన స్వామి.. కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం ఒమన్ వెళ్లారు. నాలుగు నెలల క్రితం ఆయన కూతురు మేఘమాల అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. గ్రామానికి వచ్చారు. కూతురి అంత్యక్రియల అనంతరం తిరిగి ఒమన్ వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మస్కట్‌లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురి మరణాన్ని తట్టుకోలేకే స్వామి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వామి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Updated Date - 2022-11-14T12:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising