Gaddar: ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి

ABN, First Publish Date - 2022-11-19T19:44:49+05:30

కబ్జాదారుల నుంచి భూమిని రక్షించడం కోసం పోరాటం చేస్తున్న తనకు ప్రాణహాని ఉందని ప్రజా గాయకుడు గద్దర్‌ (Gaddar) కోరారు. శనివారం ఆయన జనగామలో కలెక్టర్‌ శివలింగయ్య, డీసీపీ సీతారాంను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

Gaddar: ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: కబ్జాదారుల నుంచి భూమిని రక్షించడం కోసం పోరాటం చేస్తున్న తనకు ప్రాణహాని ఉందని ప్రజా గాయకుడు గద్దర్‌ (Gaddar) కోరారు. శనివారం ఆయన జనగామలో కలెక్టర్‌ శివలింగయ్య, డీసీపీ సీతారాంను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్న తనకు కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందని వాపోయారు. రఘునాథపల్లి (Raghunathapalli) మండలంలోని మండెలగూడెం గ్రామంలో గల బాలసాయి బాబా ట్రస్ట్‌ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. పేదలకు చెందాల్సిన భూములను కొందరు వ్యక్తులు లాక్కున్నారని అన్నారు. 59 ఎకరాల భూములు పేదలకు పంచే వరకు తాను పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న తనకు కొందరి నుంచి బెదిరింపులు వస్తున్నాయని, అందుకే రక్షణ కల్పించాలని కలెక్టర్‌, డీసీపీని కోరానని గద్దర్ తెలిపారు.

Updated Date - 2022-11-19T19:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising