కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bogus votes: తోపుదుర్తిలో బోగస్ ఓట్లు.. తొలగించొద్దంటూ ఎమ్మెల్యే ఒత్తిడి

ABN, First Publish Date - 2023-08-25T12:57:09+05:30

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్వగ్రామం తోపుదుర్తిలో భారీగా బోగస్ ఓట్లు బయటపడ్డాయి.

Bogus votes: తోపుదుర్తిలో బోగస్ ఓట్లు.. తొలగించొద్దంటూ ఎమ్మెల్యే ఒత్తిడి

అనంతపురం: రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి (Raptadu MLA Prakash Reddy) స్వగ్రామం తోపుదుర్తిలో భారీగా బోగస్ ఓట్లు బయటపడ్డాయి. ఇంటింటి ఓటరు సర్వేలో 476 డబుల్ ఓట్లు బయటపడ్డాయి. 30 మంది వరకూ చనిపోయిన వారి ఓట్లను బీఎల్వోలు గుర్తించారు. డబుల్ ఓట్లతో పాటు చనిపోయిన వారి ఓట్లను తొలగించకూడదంటూ బీఎల్ఓలపై ప్రకాష్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రెడ్డి తల్లి ప్రేమకుమారి, సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి పేర్లతో రాప్తాడు, అర్బన్ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు అయ్యింది. ప్రొద్దుటూరుకు చెందిన బంధువులను తోపుదుర్తి గ్రామం ఓటర్లుగా నమోదు చేశారు. అలాగే తోపుదుర్తి గ్రామ ఓటర్‌గా గుంతకల్లు వైసీపీ నేత, మాజీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు ఉన్నారు. తోపుదుర్తి గ్రామంలో భారీగా స్థానికేతరుల ఓట్లను బీఎల్వోలు గుర్తించారు.

Updated Date - 2023-08-25T12:57:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising