ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: కళ్యాణదుర్గంలో వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. మంత్రి ఉష శ్రీ చరణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-08-01T00:05:16+05:30

కళ్యాణదుర్గం( Kalyanadurgam )లో వైసీపీ నేతల (YCP Leaders) మధ్య వైరం మరోసారి రచ్చకెక్కింది. మొహరం(Moharam) సందర్భంగా వైసీపీలోని ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగారు.

అనంతపురం: కళ్యాణదుర్గం( Kalyanadurgam )లో వైసీపీ నేతల (YCP Leaders) మధ్య వైరం మరోసారి రచ్చకెక్కింది. మొహరం(Moharam) సందర్భంగా వైసీపీలోని ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగారు. దీంతో కళ్యాణదుర్గంలోని మంత్రి ఉష శ్రీ చరణ్(Usha Sri Charan ) ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి అండదండలతోనే కళ్యాణదుర్గంలో శాంతి భద్రతలకు ఓ వర్గం నేతలు భంగం కలిగించారంటూ మరోవర్గం నేతలు ఆరోపణలు చేశారు. కాగా రాత్రి 10 గంటల సమయంలో మంత్రి ఇంటి వద్ద ఓ వర్గం నేతలు ఆందోళనకు దిగారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఇరువర్గాల ఆందోళన నేపథ్యంలో రాత్రి 11 గంటల సమయంలోనూ మంత్రి ఇంటి వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. మంత్రి ఇంటి వద్ద ఓ వర్గం నేతలు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా కవరేజ్‌కి వెళ్లిన మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. వీడియోలు తీయకూడదంటూ మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లను గన్ మెన్లు లాక్కునే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులు పట్ల శేట్టూరు ఎస్ఐ యువరాజు, మంత్రి గన్‌మెన్లు దురుసుగా వ్యవహరించారు. దీంతో మీడియా ప్రతినిధులు నిరసనకు దిగారు.

Updated Date - 2023-08-01T00:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising