ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Highcourt: ఐఆర్‌ఆర్‌ కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణికి ఊరట

ABN, First Publish Date - 2023-10-16T15:25:05+05:30

అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు మరో ముగ్గురికి హైకోర్టులో ఊరట లభించింది.

అమరావతి: అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో (IRR Case) మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు మరో ముగ్గురికి హైకోర్టులో (AP HighCourt) ఊరట లభించింది. ఈ నలుగురు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఈ పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) విచారణ జరిగింది. వీరందరిని సీఆర్‌పీసీలోని 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ పేర్కొంది. న్యాయవాది సమక్షంలో విచారణ జరుపుతామని సీఐడీ న్యాయవాది చెప్పారు. దీంతో పిటీషన్‌లను న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి డిస్పోజ్ చేశారు.


మరోవైపు ఇదే కేసులో కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరికొంత ఊరట లభించింది. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 18కి ఏపీ హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకూ ముందస్తు బెయిల్ పొడిగించడం జరిగింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై కూడా అప్పటి వరకూ విచారించవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. తుది వాదనల కోసం ఈ నెల18 కి వాయిదా వేయడం జరిగింది.

Updated Date - 2023-10-16T15:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising