ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayawada: కార్తీక దామోదరుడికి విశేష పూజలు

ABN, First Publish Date - 2023-11-27T08:04:11+05:30

విజయవాడ: కార్తీక మాసం రెండవ సోమవారం పౌర్ణమి సందర్భంగా భక్తులు శివాలయాలకు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఆలయాలకు తరలి వచ్చారు. కార్తీక దామోదరుడికి విశేష పూజలు చేస్తున్నారు. ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారుమోగుతున్నాయి.

విజయవాడ: కార్తీక మాసం రెండవ సోమవారం పౌర్ణమి సందర్భంగా భక్తులు శివాలయాలకు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఆలయాలకు తరలి వచ్చారు. కార్తీక దామోదరుడికి విశేష పూజలు చేస్తున్నారు. ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారుమోగుతున్నాయి. అర్చకులు కార్తీక దామోదరుడికి బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు చేస్తున్నారు. పంచారామ క్షేత్రాలను, శైవ క్షేత్రాలను భక్తులు సందర్శిస్తున్నారు. నది, సముద్ర స్నానాలను ఆచరించి అరటి డొప్పల్లో కార్తీకదీపాలను వదులుతున్నారు. కార్తీక సోమవారం, పౌర్ణమి సందర్భంగా మహిళలు ఆలయాలలో 365 వొత్తులను, ఉసిరి దీపాలను వెలిగించుకొని ఉపవాసాలను ఆచరిస్తున్నారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు.

Updated Date - 2023-11-27T08:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising