ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Brahamani: ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో పాల్గొందాం.. కొవ్వొత్తులు వెలిగిద్దాం

ABN, First Publish Date - 2023-10-06T12:40:06+05:30

గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ వినూత్న కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది.

అమరావతి: గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ వినూత్న కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి (Nara Brahmani) మాట్లాడుతూ... ‘‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి... దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి? తెలుగుదేశం పార్టీ "కాంతితో క్రాంతి" కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దాం’’ అంటూ నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-10-06T12:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising