ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakha: వినూత్న రీతిలో టీడీపీ నేతల నిరసన

ABN, First Publish Date - 2023-09-27T15:30:05+05:30

విశాఖ: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరిసిస్తూ బుధవారం విశాఖలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఉత్తర నియోజక వర్గం టీడీపీ ఇన్చార్జ్ విజయబాబు ఆధ్వర్యంలో జగ్గరావు బ్రిడ్జి దగ్గర ఐస్ గడ్డలపై నిలుచుని నిరసన తెలిపారు. ‘బాబుతో నేనూ’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

విశాఖ: చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టు (Arrest)ను నిరిసిస్తూ బుధవారం విశాఖలో టీడీపీ నేతలు (TDP Leaders) వినూత్న రీతిలో నిరసన (Innovative Protest) వ్యక్తం చేశారు. ఉత్తర నియోజక వర్గం టీడీపీ ఇన్చార్జ్ విజయబాబు ఆధ్వర్యంలో జగ్గరావు బ్రిడ్జి దగ్గర ఐస్ గడ్డలపై (Ice Cubes) నిలుచుని నిరసన తెలిపారు. ‘బాబుతో నేనూ’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) ఆదేశాల మేరకు ఈ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 17 రోజుల నుంచి వినూత్న రీతిలో తాము నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. నిన్న బీచ్‌లో మోకాలిపై నిలుచుని నిరసన తెలిపామని విజయబాబు అన్నారు.

మహిళా నేతలు మాట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టినట్లు సీఎం జగన్‌‌కు (CM Jagan) కూడా తెలుసునని అన్నారు. వాళ్లు తీసుకున్నగోతిలో వాళ్లే పడ్డారని, ఇది వైసీపీ పతనానికి నాంది అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో టీడీపీ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏం చేశారనేది విద్యార్థులు, ఉద్యోగులకు తెలుసునని, ఆయన తప్పు చేయలేదని ప్రతి ఒక్కరికీ తెలుసునని, అందుకే స్వచ్చంధంగా రోడ్డోక్కి అందరం నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతోందని మహిళలు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-27T15:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising