ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒబెరాయ్ గ్రూపు గౌరవ చైర్మన్ పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూత

ABN, First Publish Date - 2023-11-14T11:05:25+05:30

దేశీయ ఆతిథ్యరంగ దిగ్గజం ఒబెరాయ్ గ్రూపు గౌరవ చైర్మన్ పృథ్విరాజ్ సింగ్ ఒబెరాయ్ (PRS Oberoi) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ‘బికీ’గా (Bike) ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన 94 ఏళ్ల వయసులో ప్రశాంతంగా కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూపు ప్రకటించింది.

న్యూఢిల్లీ: దేశీయ ఆతిథ్యరంగ దిగ్గజం ఒబెరాయ్ గ్రూపు గౌరవ చైర్మన్ పృథ్విరాజ్ సింగ్ ఒబెరాయ్ (PRS Oberoi) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ‘బికీ’గా (Bike) ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన 94 ఏళ్ల వయసులో ప్రశాంతంగా కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూపు ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయని ప్రకటనలో కంపెనీ పేర్కొంది.


కాగా భారత్‌లో హోటల్ రంగ ముఖచిత్రం మార్పునకు కారణమైన ఆయన ఫిబ్రవరి 3, 1929న ఢిల్లీలో జన్మించారు. డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్ స్కూల్లో విద్యాబ్యాసం చేశారు. అనంతరం స్విట్జర్లాండ్‌లో హోటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2002లో తండ్రి చనిపోవడంతో ‘ది ఒబెరాయ్ గ్రూపు’ మొదటి కంపెనీ ఈఐహెచ్ లిమిటెడ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ స్థాయిలో ఒబెరాయ్ హోటల్స్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. భారత్‌లోని ముఖ్యమైన టూరిస్ట్ ప్రాంతాల్లోనే కాకుండా మారిషస్, ఇండోనేసియా, ఈజిప్ట్ దేశాల్లో కూడా కొన్ని హోటల్స్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-11-14T11:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising