ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Puducherry: గర్భవతిని చేస్తే రూ.25 లక్షలు

ABN, First Publish Date - 2023-07-27T09:18:13+05:30

తమ సంతాన సాఫల్య కేంద్రానికి సంతానం కోసం వచ్చే మహిళలతో శారీరకంగా కలిసి, వారిని గర్భిణులను చేస్తే రూ.25 లక్షల నగదు ఇస్తామంటూ మోసపూరిత

- పుదుచ్చేరిలో కొత్తరకం మోసం

- నేపాల్‌వాసి నుంచి రూ.50 వేలు స్వాహా

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): తమ సంతాన సాఫల్య కేంద్రానికి సంతానం కోసం వచ్చే మహిళలతో శారీరకంగా కలిసి, వారిని గర్భిణులను చేస్తే రూ.25 లక్షల నగదు ఇస్తామంటూ మోసపూరిత హామీలిచ్చిన ఓ ముఠా... నేపాల్‌వాసి నుంచి రూ.50 వేలను స్వాహా చేసింది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు... పుదుచ్చేరి(Puducherry)లోని మాహేలో శ్రీజిత్‌ (44) అనే వ్యక్తి స్థానికంగా ఒక గెస్ట్‌ హౌస్‌(Guest House) నడుపుతున్నాడు. ఇక్కడ నేపాల్‌కు చెందిన షాజన్‌ భట్టారాయ్‌ పని చేస్తున్నాడు. ఈయన మొబైల్‌కు గుర్తు తెలియని నెంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. తన వద్ద ఒక బెస్ట్‌ ఆఫర్‌ ఉందని, తమ కేంద్రానికి వచ్చే మహిళలను గర్భిణులను చేస్తే రూ.25 లక్షలు ఇస్తామంటూ నమ్మబలికారు. ముందుగా రూ.2 లక్షల అడ్వాన్స్‌ ఇస్తామని, ఇందుకోసం ఆధార్‌, బ్యాంకు ఖాతా నెంబరు, గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరాడు.

ఆ మాటలు నమ్మిన షాజన్‌(Shajan).. అడిగినవన్నీ పంపించాడు. కొంతసేపటి తర్వాత ఒక మహిళతో శారీరకంగా కలిసేందుకు రూ.5 లక్షలు, రూ.49 వేలు చొప్పున షాజన్‌ బ్యాంకు ఖాతాకు డబ్బులు డిపాజిట్‌ చేసినట్టుగా రిసిప్టులను మొబైల్‌ వాట్సాప్‌(Mobile WhatsApp) నెంబరుకు పంపించాడు. అయితే, ఈ డబ్బును పూర్తిగా పొందాలంటే దరఖాస్తు ఫాంను పూర్తి చేసి, దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో షాజన్‌ తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ అయిందా లేదా అనే విషయాన్ని తనిఖీ చేయకుండానే ఆ వ్యక్తి పంపిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగా, బ్యాంకు ఖాతాలోని రూ.50 వేలను మోసగాళ్ళు తమ బ్యాంకు ఖాతాల్లోకి మార్చుకున్నారు. ఆ తర్వాత షాజన్‌ తన బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా, అందులో డబ్బులు డిపాజిట్‌ కాకపోవడంతో పాటు ఆ ఖాతాలో ఉన్న రూ.50 వేలు మాయమైనట్టు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2023-07-27T09:45:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising