Miss Universe, 2022 : మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న సుందరి ఎవరంటే...
ABN, First Publish Date - 2023-01-15T11:09:54+05:30
ఈ అందాల పోటీల్లో ఫస్ట్ రన్నరప్గా వెనెజులాకు చెందిన సుందరి అమంద డుడమెల్ (Amanda Dudamel), సెకండ్ రన్నరప్గా
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ఆర్బానీ గేబ్రియాల్ (R'Bonney Gabriel) మిస్ యూనివర్స్, 2022 కిరీటాన్ని దక్కించుకుంది. మిస్ యూనివర్స్ 71వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో ఆమెను విజేతగా ప్రకటించిన వెంటనే మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు చకచకా కిరీటాన్ని గేబ్రియాల్కు ధరింపజేసింది. అమెరికాలోని న్యూ ఆర్లియాన్స్లో జనవరి 15న అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ అందాల పోటీల్లో ఫస్ట్ రన్నరప్గా వెనెజులాకు చెందిన సుందరి అమంద డుడమెల్ (Amanda Dudamel), సెకండ్ రన్నరప్గా డొమెనికన్ రిపబ్లిక్కు చెందిన ఆండ్రీనా మార్టినెజ్ (Andreina Martinez) నిలిచారు.
కర్ణాటకకు చెందిన దివిట రాయ్ (Divita Rai) ఈ పోటీలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమెకు టాప్ 16లో చోటు దక్కింది. అత్యంత ఆకర్షణీయమైన ఈ కిరీటం కోసం 80 మందికిపైగా పోటీ పడ్డారు.
హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) 2021లో భారత దేశానికి మిస్ యూనివర్స్ టైటిల్ను తీసుకొచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ టైటిల్ను భారత దేశానికి తీసుకొచ్చిన ఘనత ఆమెకు దక్కింది.
Updated Date - 2023-01-15T11:15:18+05:30 IST