ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmir: రాజౌరీలో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల గాలింపు...ఎన్‌కౌంటర్

ABN, First Publish Date - 2023-05-05T10:33:42+05:30

జమ్మూకశ్మీరులో శుక్రవారం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు....

Jammu and Kashmir Encounter
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో శుక్రవారం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.(Encounter underway in Rajouri) రాజౌరీ జిల్లాలోని కేసరి ప్రాంతంలోని కంది గ్రామం వద్ద శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. గత మూడు రోజుల్లో మూడు ఎన్‌కౌంటర్ లు జరిగాయి. రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)పోలీసులు సీఆర్‌పీఎఫ్ బలగాలతో కలిసి శుక్రవారం గాలింపు ప్రారంభించారు.భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు.

ఇది కూడా చదవండి : Big Relief For Consumers: కేంద్రం ఆదేశంతో తగ్గనున్న వంటనూనెల ధరలు

గురువారం బారాముల్లా జి్లలాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.పోలీసులు మృతుల వద్ద నుంచి ఒక ఏకే 47, పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు.కుప్వారాలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ తో సరిహద్దుల్లో పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలమైంది.

Updated Date - 2023-05-05T10:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising