ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GO First Flight: విమానంలో మహిళా సిబ్బందిని వేధించిన విదేశీ ప్రయాణికుడు

ABN, First Publish Date - 2023-01-07T19:18:58+05:30

న్యూయార్క్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం(Air India)లో ఓ ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా(Shankar Mishra) అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటనను మర్చిపోకముందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోవా: న్యూయార్క్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం(Air India)లో ఓ ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా(Shankar Mishra) అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటనను మర్చిపోకముందే.. న్యూఢిల్లీ (New Delhi) నుంచి గోవా (Goa) వెళ్తున్న గో ఫస్ట్ (Go First) విమానంలో అలాంటి ఘటనే జరిగింది. విదేశీ పర్యాటకుడు విమానంలో మహిళా సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వేధింపులకు గురిచేశాడు. ఈ నెల 5న జరిగిందీ ఘటన.

విమానం గోవాలోని కొత్త ఎయిర్‌పోర్టు మోపాలో ల్యాండయ్యాక నిందితుడిని విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. డీజీసీఏకు కూడా ఈ ఘటనపై సమాచారం అందించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. గోవాలోని కొత్త విమానాశ్రయం ప్రారంభమైన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.

న్యూయార్క్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. పరారీలో ఉన్న నిందితుడు శంకర్ మిశ్రాను శుక్రవారం రాత్రి బెంగళూరులో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు పాటియాల హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 14 రోజులు జుడీషియల్ కస్టడీకి తరలించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే తాజా ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.

Updated Date - 2023-01-07T19:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising