ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kangana Ranaut: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కంగన సంకేతాలు

ABN, First Publish Date - 2023-11-03T19:30:40+05:30

ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు బాలీవుడ్ నటి కంగన రనౌత్ సంకేతాలిచ్చారు. కృష్ణ భగవానుడు ఆశీస్సులుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. ప్రఖాత ద్వారక ఆలయాన్ని కంగనా రనౌత్ శుక్రవారంనాడు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ద్వారక: ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు బాలీవుడ్ నటి కంగన రనౌత్ (Kangana Ranaut) సంకేతాలిచ్చారు. కృష్ణ భగవానుడు ఆశీస్సులుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. ప్రఖాత ద్వారక ఆలయాన్ని కంగనా రనౌత్ శుక్రవారంనాడు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై మీడియా అడిగిన ప్రశ్నకు, కృష్ణ భగవానాడు ఆశీస్సులు ఉంటే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.


బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించారు. అయోధ్యలో 600 ఏళ్ల పోరాటం తర్వాత రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట, ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయని, కేంద్రం చొరవతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ జెండా ఎగురనుందన్నారు. సముద్రంలో మునిగిపోయిన ద్వారక సిటీని దర్శించేందుకు యాత్రికులకు వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని ఆమె కోరారు. ద్వారకను దేవభూమిగానే తాను ఎప్పుడూ చూస్తానని, ఇక్కడ అణువణువూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందని, తరచు తాను ఇక్కడకు వచ్చి భగవానుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటానని చెప్పారు. చేతిలో ఉన్న పని ముగిసిన వెంటనే స్వామి దర్శనానికి వస్తుంటానని చెప్పారు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకను పైనుంచి కూడా చూడవచ్చని, అండర్‌వాటర్ నుంచి ద్వారకా నగర అవశేషాలను చూసేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. కృష్ణుని ద్వారకానగరం తనకు స్వర్గంలా అనిపిస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న 'ఎమర్జెన్సీ' చిత్రంలోనూ, 'తను వెడ్స్ మను పార్ట్ 3'లోనూ నటిస్తున్నానని మరో ప్రశ్నకు సమాధానంగా కంగనా రనౌత్ చెప్పారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కంగనా రనౌత్ నటించిన 'తేజాస్' చిత్రం ఇటీవలే విడుదలైంది.

Updated Date - 2023-11-03T19:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising