ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Khushboo: సినీ నటి ఖుష్బూ సంచలన కామెంట్స్.. నా రాజకీయ బడిలో తొలి గురువు ఆయనే..

ABN, First Publish Date - 2023-09-06T08:05:11+05:30

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్మరించుకుంటూ దేశమంతటా గురుపూజోత్సవం జరుపుకుంటుండగా, పలువురు ప్రముఖులు తమకు

- ఖుష్బూ ట్వీట్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్మరించుకుంటూ దేశమంతటా గురుపూజోత్సవం జరుపుకుంటుండగా, పలువురు ప్రముఖులు తమకు పాఠాలు చెప్పిన తొలి గురువుల విశిష్టతలను జ్ఞప్తికి తెచ్చుకుని సందేశాలు వెలువరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని స్మరించుకుంటూ ట్విట్టర్‌ పేజీలో ఓ సందేశం పొందుపరిచారు. 2010లో ఖుష్బూ కరుణానిధి సమక్షంలో డీఎంకే(DMK) సభ్యత్వం పొంది రాజకీయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 2014లో డీఎంకే నుండి వైదొలగి, కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అటుపిమ్మట 2020 అక్టోబర్‌లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఖుష్బూ బీజేపీ(BJP)లో జాతీయ కమిటీ సభ్యురాలిగా, మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె తన ట్విట్టర్‌ పేజీలో తన రాజకీయ తొలిగురువు కలైంజర్‌ను స్మరిస్తూ ట్వీట్‌ చేశారు. ‘నా రాజకీయ బడిలో తొలి గురువు’ అంటూ పేర్కొని కరుణానిధితో తీసుకున్న ఫొటోను కూడా పొందుపరిచారు. ఈ వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-09-06T08:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising