ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

LTTE: తమిళనాడులో మళ్లీ ఎల్టీటీఈ కదలికలు?

ABN, First Publish Date - 2023-08-27T08:31:57+05:30

రాష్ట్రంలో మళ్లీ ఎల్టీటీఈ(LTTE) కదలికలు మొదలయ్యాయా?.. ఇందులో భాగంగానే ఇటీవ ఆయుధాల స్మగ్లింగ్‌ పెరిగిందా?...

- ఆయుధాల స్మగ్లింగ్‌లో 13 మంది అరెస్టు

- రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ఇంటెలిజెన్స్‌ తీవ్ర నిఘా

- సముద్రతీరాల్లో భద్రత పటిష్ఠం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ ఎల్టీటీఈ(LTTE) కదలికలు మొదలయ్యాయా?.. ఇందులో భాగంగానే ఇటీవ ఆయుధాల స్మగ్లింగ్‌ పెరిగిందా?... అవుననే అంటున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు. అందుకే శ్రీలంక(Sri Lanka) తమిళుల జాడలున్న అన్నిచోట్లా నిఘా పటిష్ఠం చేసినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో మళ్లీ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈకి నూతన జవసత్వాలు కల్పించే దిశగా పాకిస్థాన్‌ నుంచి, రాష్ట్రం నుంచి భారీ ఎత్తున ఆయుధాల స్మగ్లింగ్‌ జరుగుతోందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. తిరుచ్చి శ్రీలంక శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న శ్రీలంకవాసులు కొందరికి ఆయుధాల స్మగ్లింగ్‌తో సంబంధాలున్నట్లు వెల్లడైన సమాచారం ఆధారంగా ఇటీవల ఎన్‌ఐఏ అధికారులు వలసరవాక్కంలో 13 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి 2021లో కేరళలోని విళింజం సముద్రతీరంలో మారణాయుధాలతో కొట్టుకు వచ్చిన పడవ కేసుతో సంబంధం ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే శ్రీలంకకు మారణాయుధాలను అక్రమంగా తరలించారనే నేరారోపణలపై స్థానిక సేలయూరులో దాగిన ఆదిలింగం అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఇతడికి పాకిస్థాన్‌ నుంచి శ్రీలంకకు మారణాయుధాలను తరలిస్తున్న ముఠా నాయకులతో సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు.

పాకిస్థాన్‌కు చెందిన హాజీ సలీం అనే మారణాయుధాల స్మగ్లర్‌కు ఈ ఆదిలింగం శ్రీలంకకు కేరళ మీదుగా మారణాయుధాలను తరలించేందుకు అన్ని విధాలా సహకరించినట్లు అధికారులు తెలుసుకున్నారు. శ్రీలంకలో ఎల్టీటీఈ(LTTE) ఉగ్రవాద సంస్థకు మళ్లీ నూతన జవసత్వాలు కల్పించేదిశగానే ఆదిలింగం ఈ మారణాయుధాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిఘా వేస్తున్నారు. ముఖ్యంగా శ్రీలంక తమిళులు అధికంగా నివసించే ప్రాంతాల్లోనూ, శ్రీలంక శరణార్థులు నివసిస్తున్న పునరావాస కేంద్రాల వద్ద నిఘాను తీవ్రతరం చేశారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై తదితర నగరాల్లోని యువకులను ఎల్టీటీఈలో సభ్యులుగా చేర్చేందుకు కూడా ఆదిలింగం ఆయన అనుచరులు తీవ్రంగా ప్రయత్నించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులకు కూడా తెలియజేసి అప్రమత్తం చేశారు. దీనితో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు, క్యూబ్రాంచ్‌ పోలీసులు, సముద్రతీర భద్రతా దళం సభ్యులతో కలసి రాష్ట్రమంతటా తీవ్ర నిఘా వేస్తున్నారు.

Updated Date - 2023-08-27T08:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising