ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manipur Violence : మణిపూర్‌లో హింసాకాండ.. సైన్యం మోహరింపు, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, కర్ఫ్యూ విధింపు..

ABN, First Publish Date - 2023-05-04T13:06:43+05:30

మణిపూర్ రాజధాని నగరం ఇంఫాల్‌లో హింస ప్రజ్వరిల్లింది. అనేక వాహనాలను తగులబెట్టారు, ప్రార్థనా స్థలాలకు నిప్పు పెట్టారు.

Violence in Manipur
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మణిపూర్ రాజధాని నగరం ఇంఫాల్‌లో హింస ప్రజ్వరిల్లింది. అనేక వాహనాలను తగులబెట్టారు, ప్రార్థనా స్థలాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని పిలిచారు. ముఖ్యంగా చురాచాంద్‌పూర్, ఇంఫాల్‌ నగరాల్లో హింసాకాండ పెచ్చుమీరింది. ఈ పరిస్థితి గురించి ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చించారు.

మెజారిటీగా ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను ఎస్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ (ATSUM) నాయకత్వం వహిస్తోంది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది. బుధవారం నిర్వహించిన సంఘీభావ ప్రదర్శనలో వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారని, ఈ ప్రదర్శన ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. తమ ప్రదర్శన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్‌లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దీంతో హింస ప్రజ్వరిల్లిందని తెలిపింది. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ, ఇంఫాల్‌, తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తగులబెట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. ఈ హింసాకాండలో చాలా మంది గాయపడినట్లు, ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోందన్నారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఉద్రిక్తతలను సడలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనులు ప్రశాంతంగా ఉండాలని కోరారు.

ముఖ్యమంత్రి స్పందన

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ స్పందిస్తూ, సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్థాలే దీనికి కారణమని చెప్పారు. ఇరు వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి, వారి సుదీర్ఘ సమస్యలకు పరిష్కారాన్ని సాధిస్తామని చెప్పారు. గత 24 గంటల్లో జరిగిన విధ్వంసకాండలో విలువైన ప్రాణాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇళ్లు, ఆస్తులకు నష్టం జరగడం దురదృష్టకరమని అన్నారు.

మెయిటీలకు ఎస్‌టీ హోదాను ఇవ్వాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నవారు స్పందిస్తూ, మణిపూర్ జనాభాలో మెయిటీలు 53 శాతం మంది ఉన్నారని, వారిని ఎస్టీల్లో చేర్చడం వల్ల తమకు ఉద్యోగావకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు తగ్గిపోతాయని వాపోతున్నారు. మెయిటీలు ముఖ్యంగా ఇంఫాల్ లోయలో ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో గిరిజనులు 40 శాతం మేరకు ఉంటారు. నాగాలు, కుకీలు కూడా గిరిజనులే.

సీఎంకు అమిత్ షా ఫోన్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదిలావుండగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం, పారామిలిటరీ దళాలను మోహరించారు. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని తరలించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

బాక్సర్ మేరీ కోమ్ ఆవేదన

ప్రముఖ క్రీడాకారిణి మేరీ కోమ్ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘నా రాష్ట్రం తగులబడుతోంది. దయచేసి సహాయపడండి’’ అని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వివిధ మీడియా సంస్థలకు ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మణిపూర్ దుస్థితిని వివరించారు. అందరికీ రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తన హృదయాంతరాళాల్లోంచి కోరుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు.

ఇంటర్నెట్ సేవల నిలిపివేత

హింసాకాండ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. శాంతిభద్రతలను కాపాడటం కోసం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

సహాయ కార్యక్రమాలు

సైన్యం నిర్వహిస్తున్న, ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాల్లో దాదాపు 4000 మంది గ్రామస్థులను ఉంచారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు సైన్యం కవాతు నిర్వహించింది. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 7,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాల్లో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ సిబ్బంది పాల్గొంటున్నారు.

అసలు ఎందుకు ఈ నిరసన?

మణిపూర్‌లో మెజారిటీగా ఉన్న (53 శాతం మంది) మెయిటీ తెగవారిని షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఏటీఎస్‌యూఎం రాష్ట్రంలోని మొత్తం 10 జిల్లాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. బుధవారం వేలాది మంది గిరిజనులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

మెయిటీలు ఏమంటున్నారు?

మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా మణిపూర్ రాష్ట్రంలోకి వలస వస్తున్నారు. వీరివల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మెయిటీలు వాదిస్తున్నారు. తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఇంఫాల్ లోయలోని రాజకీయ నాయకులు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Atiq Ahmed Murder : అతిక్ సోదరుల హత్యతో వెలుగు చూసిన మరో దారుణం.. కారును ఓవర్‌టేక్ చేసిన వ్యక్తిని చంపేసిన గ్యాంగ్‌స్టర్..

Congress Vs BJP : ముస్లింలను కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తోంది : కర్ణాటక సీఎం

Updated Date - 2023-05-04T13:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising