ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Zoramthanga: గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన సీఎం

ABN, First Publish Date - 2023-12-04T18:25:33+05:30

ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తూ మిజోరం ముఖ్యమంత్రి జోరంతాంగ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ డాక్టర్ హరిబాబు కుంభంపాటికి అందజేశారు. ఆయన రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారంనాడు వెలువడిన మిజోరం ఎన్నికల ఫలితాల్లో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ మొత్తం 40 స్థానాలకు 27 స్థానాల్లో గెలుపొంది అధికారం ఖాయం చేసుకుంది.

ఐజ్వాల్: ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తూ మిజోరం (Mizoram) ముఖ్యమంత్రి జోరంతాంగ (Zoramthang) తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ డాక్టర్ హరిబాబు కుంభంపాటికి అందజేశారు. ఆయన రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారంనాడు వెలువడిన మిజోరం ఎన్నికల ఫలితాల్లో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) మొత్తం 40 స్థానాలకు 27 స్థానాల్లో గెలుపొంది అధికారం ఖాయం చేసుకుంది. జోరంతాంగ సారథ్యంలోని మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎప్) 10 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 2, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి.


ప్రభుత్వ వ్యతిరేకతే కారణం: జోరంతాంగ

ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జోరంతాంగ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నట్టు చెప్పారు. ''ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజలు నా పనితీరుపై సంతృప్తి చెందకపోవడం ఓటమికి కారణాలు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. తదుపరి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వ వ్యతిరేకత, కోవిడ్ విరుచుకుపడటం వంటివి మా ఓటమికి కారణాలు అనుకుంటున్నాను'' అని తెలిపారు.

Updated Date - 2023-12-04T18:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising