ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Edible Oils: వంటనూనె ధరలపై అర్ధరాత్రి మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2023-06-15T14:06:56+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాలను తగ్గించింది. ఈ రెండు నూనెలపైనా దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. దీంతో వినియోగదారులకు కూడా ధరలు తగ్గే అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాలను తగ్గించింది. ఈ రెండు నూనెలపైనా దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. దీంతో వినియోగదారులకు కూడా ధరలు తగ్గే అవకాశం ఉంది.

అయితే ట్రేడర్ల స్పందన వేరే విధంగా ఉంది. ప్రభుత్వం కేవలం సెంటిమెంట్ కోసమే ఈ చర్య తీసుకుందని, క్షేత్ర స్థాయిలో దీని ప్రభావం పెద్దగా ఉండదని చెప్తున్నారు. మన దేశం రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లను అరుదుగా దిగుమతి చేసుకుంటుందని చెప్తున్నారు. వీటిని ముడి రూపంలోనే దిగుమతి చేసుకుని, భారత దేశంలోనే రిఫైన్ చేస్తారని చెప్తున్నారు. క్రూడ్ సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్‌లపై దిగుమతి సుంకం దాదాపు 5.50 శాతం.

దేశీయంగా, అంతర్జాతీయంగా కొద్ది నెలలుగా వంట నూనెల ధరలు తగ్గిపోయాయని, సుంకాలను పెంచాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం ఈ సుంకాలను తగ్గించింది. ఎన్నికల ఏడాది కావడంతో ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ట్రేడర్లు అంటున్నారు. ఎల్‌నినో సంవత్సరం కావడంతో 2023లో నైరుతి రుతుపవనాలపై ఆందోళన ఉందని అంటున్నారు. వంట నూనెల ధరలు అదుపులో ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్తున్నారు. సుంకాల తగ్గింపు వల్ల తాత్కాలికంగా సెంటిమెంటల్ ప్రభావం ఉండవచ్చునని చెప్తున్నారు.

2023 జూన్ 2నాటి సమాచారం ప్రకారం దిగుమతి చేసుకున్న క్రూడ్ పామాయిల్ ధర భారత దేశంలో టన్నుకు దాదాపు 860 డాలర్లు. ఇది గత ఏడాది కన్నా 45 శాతం తక్కువ. దిగుమతి చేసుకున్న క్రూడ్ సోయాబీన్ టన్ను ధర 970 డాలర్లు. ఇది గత ఏడాది కన్నా 43 శాతం తక్కువ. దిగుమతి చేసుకున్న క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర టన్నుకు 860 డాలర్లు. ఇది గత ఏడాది కన్నా 55 శాతం తక్కువ.

2023 ఏప్రిల్‌లో మన దేశం 1.05 మిలియన్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో దిగుమతి చేసుకున్నదాని కన్నా 15 శాతం ఎక్కువ.

ఇవి కూడా చదవండి :

Kolkata Airport : కోల్‌కతా విమానాశ్రయంలో స్వల్ప అగ్ని ప్రమాదం

Cyclone Biparjoy : బిపర్‌జోయ్ తుపాను ప్రభావం.. ద్వారకలోని శ్రీ భడకేశ్వర్ మహాదేవ్ దేవాలయం వద్ద సముద్రం అల్లకల్లోలం..

Updated Date - 2023-06-15T14:11:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising