ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi birthday: మోదీ పుట్టినరోజు కేక్ కట్ చేసిన సీమా హైదర్

ABN, First Publish Date - 2023-09-17T19:23:38+05:30

ప్రేమించిన వ్యక్తితో జీవించేందుకు ఇటీవల నేపాల్ ద్వారా ఇండియాలో ప్రవేశించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ ఆదివారంనాడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. కొవ్వొ్త్తులు వెలిగించి, కేక్ కట్ చేయడం ద్వారా మోదీకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపింది.

న్యూఢిల్లీ: ప్రేమించిన వ్యక్తితో జీవించేందుకు ఇటీవల నేపాల్ ద్వారా ఇండియాలో ప్రవేశించి సంచలనం సృష్టించిన పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ (seema haider) ఆదివారంనాడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 73 పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. కొవ్వొ్త్తులు వెలిగించి, కేక్ కట్ చేయడం ద్వారా మోదీకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపింది. సీమా హైదర్ భర్త సచిన్, ఆమె నలుగురు పిల్లలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె విడుదల చేసింది.


ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి నరేంద్ర మోదీ ఖ్యాతి తెచ్చారని సీమా హైదర్ ఆ వీడియోలో కొనియాడింది. చివరల్లో 'హిందుస్థాన్ జిందాబాద్' అంటూ నినాదం చేసింది. 30 ఏళ్ల సీమా హైదర్ ఇటీవల రక్షాబంధన్‌కు ఒకింత ముందుగానే ప్రధానమంత్రికి రాఖీ పంపారు. ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రక్షణ మంత్రి రాజన్‌నాథ్ సింగ్, ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సైతం రాఖీలు పంపారు.


పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన సీమా హైదర్‌‌, గ్రేటర్ నొయిడాకు చెందిన సచిన్‌కు 2019-20లో ఆన్‌లైన్ పబ్జి గేమ్‌లో పరిచయమైంది. సచిన్‌తో కలిసి జీవించేందుకు గత మేలో ఆమె తన నలుగురు పిల్లల్ని తీసుకుని నేపాల్ గుండా అక్రమ పద్ధతిలో భారతదేశంలోకి అడుగుపెట్టిది. కొద్దికాలం పాటు రబుపుర ఏరియాలో రహస్యంగా ఇద్దరూ నివసించారు. జూలై 4న పోలీసులు వీరిని అరెస్టు చేయగా, జూలై 7న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె పాకిస్థాన్ వనిత కావడంతో ఆ కోణం నుంచి స్థానిక పోలీసులు, యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ వేర్వేరుగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-09-17T20:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising