కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TANA: తానా, కార్యసిద్థి హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో ‘గీతా గాన ప్రవచనం’.. అనూహ్య స్పందన

ABN, First Publish Date - 2023-07-31T22:53:41+05:30

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), కార్యసిద్థి హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో "బ్రహ్మశ్రీ డా. గంగాధర శాస్త్రి ‘గీతా గాన ప్రవచనం" కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. కార్యసిద్థి హనుమాన్ ఆలయంలో భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటున్న పిల్లలు కొన్ని శ్లోకాలను ఆలపించి, అందరిని ఆకట్టుకున్నారు. పిల్లలకు చక్కగా భగవద్గీత నేర్పించడానికి ప్రోత్సహిస్తున్న తలిదండ్రులను, నేర్పిస్తున్న గురువులను గంగాధర శాస్త్రి గారు వారి దీవెనలతో అభినందించారు.

TANA: తానా, కార్యసిద్థి హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో ‘గీతా గాన ప్రవచనం’.. అనూహ్య స్పందన

డాలస్ టెక్సస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), కార్యసిద్థి హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో "బ్రహ్మశ్రీ డా. గంగాధర శాస్త్రి ‘గీతా గాన ప్రవచనం" కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. కార్యసిద్థి హనుమాన్ ఆలయంలో భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటున్న పిల్లలు కొన్ని శ్లోకాలను ఆలపించి, అందరిని ఆకట్టుకున్నారు. పిల్లలకు చక్కగా భగవద్గీత నేర్పించడానికి ప్రోత్సహిస్తున్న తలిదండ్రులను, నేర్పిస్తున్న గురువులను గంగాధర శాస్త్రి గారు వారి దీవెనలతో అభినందించారు.

0e52b4b6-5d43-4630-b37b-0b8395ada7d4.jpeg

తానా కార్యదర్శి కొల్లా అశోక్‌బాబు కార్యక్రమాన్ని ప్రారంభించి అందరికీ ‘గీతాగాన ప్రవచనం’ కార్యక్రమానికి స్వాగతం పలికి, డా. గంగాధర శాస్త్రి గారు ముఖ్య అతిథిగా రావడం మన అదృష్టం అని, తానా తరపున వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. రాబోయే కాలంలో తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవరపు, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి పరమేష్ దేవినేని మరియు తానా కార్యవర్గ బృందం సారధ్యంలో మరిన్ని మంచి మంచి కార్యక్రమలను మీముందుకు తీసుకు వస్తున్నామని, తానా డాలస్‌లో నిర్వహించే కార్యక్రమాలలో అందరు పాల్గొనవలసిందిగా కోరారు. తదుపరి తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్‌ను ఆహ్వానించి గంగాధర శాస్త్రిని సభకు పరిచయం చేయవలసిందిగా కోరారు.

వేంకట గంగాధర్ శాస్త్రిని డా. తోటకూర ప్రసాద్ పరిచయం చేస్తూ ఈ విధంగా ఆయన గురించి చెప్పారు. గంగాధర్ శాస్త్రి గాయకుడు, స్వరకర్తగా మంచి కీర్తిని సంపాదించినా, సమాజానికి మేలు చేయాలనే సదుద్దేశంతో భగవద్గీత ఫౌండేషన్‌ను స్థాపించి, ఆ సంస్థ ద్వారా భావి తరాలకు నిబద్ధతతో వారు అందిస్తున్న సంపద ఎంతో ఉత్తమమైనదని, అన్నింటి కంటే తనకు మంచి మిత్రులు అని చెప్పి వారిని అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా వేదిక పైకి ఆహ్వానించారు. హనుమాన్ ఆలయం ఛైర్మన్ డా. వెలగపూడి ప్రకాశరావు మాట్లాడుతూ.. భగవద్గీత స్వధర్మం వదలకుండా హిందువులు ఐకమత్యంగా సమాజంలో జరుగుతున్న అధర్మాన్ని అరికట్టడానికి పాటు పడాలని కోరారు.

డా. వేంకట గంగాధర శాస్త్రి మాట్లాడుతూ పరమాత్మ మనిషి అనే ప్రోడక్టును సృష్టించి దానిని ఎలా సద్వినియోగం చేయాలో అని మనకు ఇచ్చి పంపించిన ప్రోడక్టు మాన్యువల్ పేరే ‘భగవద్గీత’ అని అందరికీ సులువుగా అర్థం అయ్యేలా సరళమైన భాషలో వివరించారు. వేదవ్యాసుల వారు రచించిన మహాభారతంలో కొన్ని పర్వాలు సారాంశం ఆధారంగా భగవద్గీతను శ్రీ కృష్ణ పరమాత్మ, అర్జునుడుకు ఉపదేశించిన సారాంశమే భగవద్గీత అని చెప్పారు.


గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర విస్తరైః

యాస్వయం పద్మ నాభస్య ముఖ పద్మ విని స్సృతా!! అనే శ్లోకాన్ని రాగయుక్తంగా ఆలపించి దాని అర్థాన్ని వివరించారు. శబ్దాన్ని అక్షర బద్దం చేసే శక్తి మన తెలుగు భాషకు మాత్రమే ఉందని, మన మాతృ భాషను కాపాడుకోనే బాధ్యత మన అందరిదని గుర్తు చేశారు. హిందువు అంటే సర్వజన బంధువు అని చెప్పారు. భగవద్గీత అన్ని గ్రంథాల సారాంశం అని, బాల్యం నుంచే పిల్లలకు భగవద్గీత నేర్పాలని, రిటైర్మెంట్ తర్వాత నేర్చుకొనే గ్రంథం కాదని గుర్తు చేశారు. అన్ని మత గ్రంథాలకంటే భగవద్గీత పురాతనమైన గ్రంథం అని గుర్తు చేసి, ప్రవాస భారతీయులు, అమెరికా మరియు పలు దేశాల ప్రముఖులు, తత్వవేత్తలు కూడ భగవద్గీత ప్రాముఖ్యతను కొనియాడారని చెప్పారు. హిందుత్వం 5000 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం, జీవితం అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బ్రతకడం అదే భగవద్గీత సారాంశం అన్నారు. పిల్లలు భగవద్గీతను చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం, ప్రచారం చేయడం వంటి లక్షణాలను ఆచరించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం మంచి పని చేయడమే మనిషి ధర్మం, దాని ఫలితం అందించడం పరమాత్మ పరమావధి అని అన్నారు. భగవద్గీతలో చర్చించని అంశం లేదని, ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని చెప్పారు. అలాగే అనేక భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడి వినడానికి వచ్చిన శ్రోతలందరికీ శ్రవణానందంతో పాటు మనోవుల్లాసం కలిగేలా చేశారు.

తానా ప్రస్తుత కార్యదర్శి అశోక్ బాబు కొల్లా, డా. తోటకూర ప్రసాద్, సతీష్ వేమూరి, శ్రీకాంత్ పోలవరపు, లొకేష్ నాయుడు, నాగరాజు నలజుల, చినసత్యం వీర్నపు, లెనిన్ వీర మరియు తానా కార్యవర్గ బృంద సభ్యులు మరియు డా. ప్రకాశరావు వెలగపూడి, హనుమాన్ ఆలయం కార్యవర్గ బృందం సభ్యులు ముఖ్య అతిథి డా. గంగాధర శాస్త్రిని పుష్పగుచ్చం, శాలువా, జ్ఞాపిక మరియు ‘గీతా గాన విభూషణ’ బిరుదుతో ఘనంగా సత్కరించారు.

లోకేష్ నాయుడు, శ్రీకాంత్ పోలవరపు, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, వెంకట్ ములుకుట్ల, డా. వెలగపూడి ప్రకాశరావు, డా. ప్రసాద్ తోటకూర, రావు కలవుల, డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, నరేంద్ర.B, గంగాధర శాస్త్రి గారి తనయుడు విశ్వతేజ, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, లెనిన్ వేముల, నాగరాజు నలజుల, చినసత్యం వీర్నపు, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, దిలీప్ మొదలైన పలువురు పుర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ డా. గంగాధర శాస్త్రి ‘గీతా గాన ప్రవచనం’ కార్యక్రమం దాతలకు, వేదికను ఇచ్చిన కార్యసిద్థి హనుమాన్ టెంపుల్ అధినేత డా. ప్రకాశరావు వెలగపూడికి, వివిధ ప్రసార మాధ్యమాలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, అన్ని సహాయ సహకారాలు అందించిన తానా ప్రాంతీయ ప్రతినిధి పరమేష్ దేవినేనికి అశోక్ బాబు కొల్లా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-07-31T22:55:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising