ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: నెలల తరబడి ఇంటికి రాని భర్త.. ఒకరికి ముగ్గురిని పెళ్లి చేసుకున్న భార్య.. ఆమె నిర్వాకం అసలెలా బయటపడిందంటే..!

ABN, First Publish Date - 2023-11-08T13:17:42+05:30

పనిలో పడి భర్త నెలల తరబడి ఇంటికి రాకపోవడంతో ఓ భార్య వింత నిర్వాకానికి పాల్పడింది. అతనికి తెలియకుండా ఏకంగా ముగ్గురిని పెళ్లాడింది. ఒకరికి తెలియకుండా ఒకరిని నమ్మించి వివాహం చేసుకుంది.

Wife: పనిలో పడి భర్త నెలల తరబడి ఇంటికి రాకపోవడంతో ఓ భార్య వింత నిర్వాకానికి పాల్పడింది. అతనికి తెలియకుండా ఏకంగా ముగ్గురిని పెళ్లాడింది. ఒకరికి తెలియకుండా ఒకరిని నమ్మించి వివాహం చేసుకుంది. కానీ, చివరికి ఆమె పెళ్లాడిని ముగ్గురిలో ఒకరికి ఆమె మోసం తెలియడంతో బండారం బయటపడింది. ఆ ముగ్గురి నుంచి రూ.80లక్షల వరకు కాజేసింది కూడా. దాంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌ (Jiangsu province) కు చెందిన జౌ అనే మహిళకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ పాప ఉంది. అయితే, జౌ భర్త పని కోసం నెలనెల తరబడి ఆమెకు దూరంగా ఉండేవాడు. ఇదే అదునుగా భావించిన జౌ.. మొదట ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో తనకు పెళ్లైందని, కానీ మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు చెప్పింది. అలాగే విడాకులకు కూడా దరఖాస్తు చేసినట్లు తెలిపింది.

Shocking: 28 ఏళ్ల కుర్రాడికి వింత కష్టం.. మహిళా పోలీస్ స్టేషన్‌ ముందే ఆత్మహత్యకు యత్నం.. అసలెందుకిలా చేశాడో తెలిసి..!

ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతని నుంచి వివిధ కారణాలు చెప్పి కొంత మొత్తం లాగేసింది. అలా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేది. రోజురోజుకు ఆమె విలాసాలు పెరుతుగు పోయాయి. దాంతో ఇంకా ఎక్కువ నగదు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలని భావించింది. దీనికోసం మరో ఇద్దరిని పెళ్లాడింది. అలా ఒకే సమయంలో ఒకరికి తెలియకుండా ఒకరితో ఆ ముగ్గురితో రిలేషన్ కంటిన్యూ చేసింది. అలా ఆ ముగ్గురి నుంచి ఏకంగా రూ.80లక్షలు వసూలు చేసింది. అయితే, ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి వద్ద మాత్రం భారీగా దండుకుంది. అంతటితో ఆగకుండా ఇంకా డబ్బు కావాలని అతణ్ని అడిగింది. ప్రస్తుతం తాను గర్భవతినని, తల్లి వద్ద ఉంటున్నట్లు అతనితో అబద్ధం చెప్పింది.

Chicken Biryani: చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే.. పీస్‌లకు బదులుగా కోడి తలను చూసి అవాక్కైన మహిళ.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!

ఆ తర్వాత కొన్ని రోజులకు తనకు కవలు పుట్టారని చెప్పి, ఆ వ్యక్తి నుంచి డబ్బు కావాలని అడిగింది. కానీ, జౌ వ్యవహారం అతనికి ఏదో తేడా కొట్టింది. దాంతో అనుమానం వచ్చి ఆమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లాడు. తీరా.. అక్కడికి వెళ్లిన తర్వాత జౌ చెప్పిందంతా పచ్చి అబద్ధం అని తెలుసుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు జౌను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణలో ఆమె మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. దాంతో షాక్ అవ్వడం పోలీసుల వంతైంది. భర్తకు తెలియకుండా మరో ముగ్గురిని పెళ్లాడి, వారి నుంచి ఏకంగా రూ.80లక్షలు వసూలు చేసిందని తెలియడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు.

WhatsApp groups: ఎవరు పడితే వాళ్లు వాట్సప్ గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేస్తున్నారా..? ఈ ట్రిక్‌ను కనుక వాడితే..!

Updated Date - 2023-11-08T13:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising