ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Glass Bridge: ప్రముఖ పర్యాటక కేంద్రంలో రూ.37 కోట్లతో అద్దాల వంతెన

ABN, First Publish Date - 2023-05-24T11:21:14+05:30

ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో తిరువళ్లువర్‌ విగ్ర హం, వివేకానంద స్మారక మండపం నడుమ రూ.37 కోట్లతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో తిరువళ్లువర్‌ విగ్ర హం, వివేకానంద స్మారక మండపం నడుమ రూ.37 కోట్లతో కాలినడక అద్దాల వంతెనను నిర్మించనున్నారు. ఈ వంతెనకు ఈనెల 24న మంత్రి ఈవీ వేలు(Minister Ev Velu) శంకుస్థాపన చేయనున్నారు. కన్నియాకుమారికి దేశవిదేశాల నుండి వచ్చే పర్యాటకులు వివేకానంద స్మారక మండపానికి బోట్‌సఫారీ చేసి వెళుతుంటారు. అయితే ఆ ప్రాంతానికి చేరువగా ఉన్న తిరువళ్లువర్‌ విగ్రహానికి సులువుగా వెళ్ళలేకున్నారు. దీనితో ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కాలినడక వంతెన నిర్మించాలని స్థానికులు, పర్యాటకులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వీరి కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు ప్రాంతాలను కలిపే రీతిలో 97 మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పు, పైకప్పుతో అద్దాల వంతెనను నిర్మించనుంది. మంత్రి మనో తంగరాజ్‌, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, మేయర్‌ మహేష్‌ తదితరులు పాల్గొననున్నారు.

Updated Date - 2023-05-24T11:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising