ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kanniyakumari: కన్నియాకుమారిలో వెనక్కి వెళ్ళిన సముద్రం

ABN, First Publish Date - 2023-09-16T10:00:49+05:30

సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారి(Kanniyakumari)లో ఓ వైపు సముద్రం వెనక్కి మళ్ళింది. మరో వైపు రాక్షస అలలు తీరం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కన్నియాకుమారి(Kanniyakumari)లో ఓ వైపు సముద్రం వెనక్కి మళ్ళింది. మరో వైపు రాక్షస అలలు తీరం వైపు దూసుకువచ్చాయి. ఈ పరిస్థితి కారణంగా వివేకానంద స్మారక మండపం ప్రాంతానికి పూంపుహార్‌ సంస్థ బోట్‌ సఫారీని తాత్కాలికంగా రద్దు చేసింది. ఉదయం 8 గంటలకు వివేకానంద స్మారక మండపం తీరంలో సముద్రం వెనక్కి మళ్ళింది. దీంతో బోట్‌సఫారీని ఉదయం 8 గంటల నుంచి పది గంటల వరకు రద్దు చేశారు. ఆ తర్వాత సముద్రతీరం యథాస్థితికి వచ్చింది. అదే సమయంలో త్రివేణి సంగమ ప్రాంతం వద్ద అరేబియా సముద్రతీరంలో, హిందూ మహాసముద్రం తీరంలోనూ రాక్షస అలలు ఎగసిపడ్డాయి. చిన్నముట్టం, వావ్‌తురై, కోవళం, కీల్‌మణక్కుడి, మణక్కుడి తదితర సముద్రతీర గ్రామాల వద్ద 10 నుండి 15 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. దీంతో త్రివేణి సంగమ ప్రాంతంలో పర్యాటకులను స్నానం చేయడానికి అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు.

Updated Date - 2023-09-16T10:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising