ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tummala: తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే జరిగేది అదే..!

ABN, First Publish Date - 2023-11-28T13:53:20+05:30

తెలంగాణ ప్రజలకిచ్చిన మాట సోనియా (Sonia Gandhi) నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. దేశంలోనే

ఖమ్మం: తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలే కాదు.. జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేయబోతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara rao) అభిప్రాయపడ్డారు. ఖమ్మం సాయి గణేష్ నగర్‌లో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీపీఐ నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రజలకిచ్చిన మాట సోనియా (Sonia Gandhi) నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి కేసీఆర్(Cm Kcr). రాష్ట్రంలో సహజ వనరులను దోచుకున్నారు. చివరకు ఆ కుటుంబం లిక్కర్‌ను కూడా వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో ఉన్న సహజ సంపదనంతా దోచుకున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయీనా జిల్లా అభివృద్ధికి కృషి చేశాం. మీ అందరి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేము రాబోయే రోజుల్లో నడుచుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.’’ అని వెల్లడించారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-28T13:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising