ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటిపల్లి రిజర్వాయర్‌లో పడి నలుగురు మృతి

ABN, First Publish Date - 2023-01-16T16:31:04+05:30

వికారాబాద్ జిల్లా (Vikarabad District)లో విషాదం చోటుచేసుకుంది. కోటిపల్లి ప్రాజెక్టు (Kotipalli project)లో పడి నలుగురు మృతి చెందారు. పూడూరు మండలం మన్నెగూడలో ఒకే కుటుంబానికి చెందిన ఒకే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్: వికారాబాద్ జిల్లా (Vikarabad District)లో విషాదం చోటుచేసుకుంది. కోటిపల్లి ప్రాజెక్టు (Kotipalli project)లో పడి నలుగురు మృతి చెందారు. పూడూరు మండలం మన్నెగూడలో ఒకే కుటుంబానికి చెందిన ఒకే జగదీష్‌, వెంకటేశ్‌, లోకేష్‌, రాజేష్‌ నలుగురు కలిసి కోటిపల్లి ప్రాజెక్టుకు విహారయాత్రకు వెళ్లారు. ఈ నలుగురు ప్రాజెక్టులోకి దిగి గల్లంతయ్యారు. సంక్రాంతి (Sankranti) సందర్భంగా వీరంతా విహారయాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులోకి దిగిన 30 నిమిషాల్లోనే గల్లంతయ్యారు. ప్రాజెక్టులోకి దిగిన నలుగురిలో ఇద్దరి మాత్రమే ఈత కొట్టడగలరని, మరో ఇద్దరికి ఈత రాదని చెబుతున్నారు. నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. పోస్టుమార్టం (Postmortem) ముగిసిన వెంటనే మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-16T16:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising