ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మోసం చేశారు..

ABN, First Publish Date - 2023-03-05T12:35:48+05:30

వేములవాడ(Vemulawada) నియోజకవర్గంలో హాత్ సే జూడో యాత్ర(Hath Se Judo trip) పేరుతో టీపీసీసీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాజన్న సిరిసిల్ల: వేములవాడ(Vemulawada) నియోజకవర్గంలో హాత్ సే జూడో యాత్ర(Hath Se Judo trip) పేరుతో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy) చేపట్టిన జూడో యాత్ర 21 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా (నేడు) ఆదివారం వేములవాడ రాజరాజేశ్వరస్వామిని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. వేములవాడ రాజన్నను కూడా సీఎం కేసీఆర్(Cm Kcr) మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారని, గతంలో కాంగ్రెస్(Congress) హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందని మండిపడ్డారు. పెళ్ళైన ఆడపిల్లలకు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదన్నారు. దొరలకు ఒక నీతి... గిరిజనులకు ఒక నీతా? అంటూ కేసీఆర్‎ ప్రభత్వంపై మరోసారి రేవంత్ మండిపడ్డారు.

Updated Date - 2023-03-05T12:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising