ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pashamylaram: పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

ABN, First Publish Date - 2023-11-12T12:58:59+05:30

పటాన్ చెరు(Patancheru) మండలం పాశమైలారం(Pashamylaram) ఇండస్ట్రీయల్ ఏరియాలో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire Incident) జరిగింది.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు(Patancheru) మండలం పాశమైలారం(Pashamylaram) ఇండస్ట్రీయల్ ఏరియాలో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire Incident) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశమైలారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో(Chemical Factory) ఉదయాన్నే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ టైంలో పదుల సంఖ్యలో కార్మికులు అక్కడ పని చేస్తున్నారు. మంటలు అంతకంతకూ పెరగుతుండటాన్ని కార్మికులు(Labours) గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు కార్మికులకు మంటలు తగిలాయి. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ లతో అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-12T12:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising