ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCR Sabha: నాందేడ్‌లో సీఎం కేసీఆర్ స‌భకు భారీ ఏర్పాట్లు

ABN, First Publish Date - 2023-02-03T14:59:11+05:30

నాందేడ్: మ‌హారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్‌ (Nanded)లో ఈ నెల 5వ తేదీన సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాందేడ్: మ‌హారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్‌ (Nanded)లో ఈ నెల 5వ తేదీన సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాల్గొన‌నున్న సభకు భారీ ఏర్పాట్లు చేశారు. సంబంధిత ఏర్పాట్లను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి (Indrakaran Reddy) ప‌రిశీలించారు. ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌ (Jogu Ramanna), విఠ‌ల్ రెడ్డి (Vithal Reddy) టీఎస్‌ఐఐసీ చైర్మ‌న్ బాల‌మ‌ల్లు (Balamallu), త‌దిత‌రుల‌తో క‌లిసి శుక్ర‌వారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలికి చేరుకుని నిర్వాహకులతో మాట్లాడారు. సభ వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. నాందేడ్ జిల్లాతో పాటు మ‌హారాష్ట్ర‌లోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ (BRS) శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు స‌భ‌కు హాజ‌రుకానున్న నేప‌థ్యంలో అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. అంద‌రూ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచనలిచ్చారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా రూపాంత‌రం చెందిన‌ త‌ర్వాత పొరుగు రాష్ట్రంలో నిర్వ‌హించ‌నున్న తొలి స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు సంబంధించిన ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నామ‌న్నారు. ఎక్క‌డ ఎలాంటి లోటుపాట్లు తలెత్త‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్మ‌ల్ జిల్లా స‌రిహ‌ద్దు ప్రాంతం నాందేడ్‌లో స‌భ‌ నిర్వహించడం సంతోషంగా ఉంద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నాందేడ్ సభలో పలువురు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారని వెల్ల‌డించారు. మ‌హారాష్ట్రలో బీఆర్ఎస్‌కు అనూహ్య స్పంద‌న వ‌స్తోంద‌ని, నాందేడ్ జిల్లాలో అనేక గ్రామాల్లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు మ‌హారాష్ట్ర‌లో అమ‌లు చేస్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు వ్యాఖ్యనిస్తున్నార‌న్నారు. బీఆర్ఎస్ పార్టీ విస్త‌ర‌ణ‌పై కూడా ఎంతో ఆస‌క్తి క‌న‌బరుస్తున్నారని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-02-03T14:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising