Home » Nirmal
తునికాకు సేకరణకు వెళ్లిన నలుగురు మహిళలు సాయంత్రం వేళ అడవిలో దారి తప్పారు.. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో రాత్రంగా అడవిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ స్వయంగా రంగలోకి దిగారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ డీఫ్యాక్టో(అసలైన) సీఎంలా వ్యవహరిస్తున్నారని, సచివాలయంలో మంత్రులతో ఆమె సమీక్షతో రేవంత్ ఇక డమ్మీ సీఎం అన్న సంగతి స్పష్టమైపోయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో వెయ్యేళ్ల నాటి పురాతన శిల్పాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. శుక్రవారం బాసర పుణ్యక్షేత్రంలో వారు పర్యటించి పురాతన ఆలయాలను సందర్శించారు.
విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధాయ్యుడికి నిర్మల్ జిల్లా పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. నిందితుడుని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపిస్తున్నారు. పూజల కోసం భక్తులు క్యూలైన్లలో 3 గంటల నుంచి 5 గంటల సేపు వేచి చూడాల్సి వస్తోంది.
నిర్మల్ జిల్లా: అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా, దిలావర్ పూర్లోని కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు చెబుతుండడంతో పిల్లలను తల్లిదండ్రులు వారి ఇళ్లకు తీసుకువెళుతున్నారు.
‘ఈ బువ్వ తినుడు వశమైతలేదే.. ఓ రోజు మాడిన అన్నం పెట్టిన్రు.. ఇంకో రోజు అన్నంలో పురుగులు వచ్చాయి. భయమైతాంది. నన్ను ఇంటికి తీసుకుపో’.. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఇటీవల తమ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతున్న మాటలివి.
పచ్చని ప్రకృతి.. పిల్లగాలులు.. సెలయేళ్లు, వాటర్ఫాల్స్ మధ్య వన్య ప్రాణులను చూస్తూ గడిపితే ఆ ప్రశాంతతే వేరు! దీనికి ఆధ్యాత్మిక వాతావరణం తోడైతే గనక అక్కడి నుంచి కదలబుద్దేయదు! మరికొంత సమయం గడిపితే బాగుణ్ను అని అనిపిస్తుంది.
జీవో 510తో తనలాంటి ఒప్పంద ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ వకుళాభరణం భరత్కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్లో సోమవారం జరిగిందీ విషాదం.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పులి దర్జాగా రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడింది. దీంతో వాహనదారులు పులిని సెల్ ఫోన్లతో ఫోటోలు తీసారు. ఈ క్రమంలో అటవీ అధికారులు దిమ్మదుర్తి సుర్జాపూర్, మాస్కాపూర్, ఎక్బాల్ పూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.