ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Priyanka: తెలంగాణలో నేడు ప్రియాంక గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

ABN, First Publish Date - 2023-11-19T07:39:12+05:30

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచింది. అగ్ర నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) ప్రచారంలో జోరు పెంచింది. అగ్ర నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణలో పర్యటించనున్నారు. ఖానాపూర్, అసిఫాబాద్ నియోజక వర్గాలలో ప్రచారం చేయనున్నారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10.30 గంటలకు ఖానాపూర్ చేరుకోకున్నారు. ఖానాపూర్‌లో గంటసేపు ప్రచారం చేయనున్నారు. 12 గంటలకు అసిఫాబాద్ వస్తారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది.

అనంతరం ప్రియాంక గాంధీ నాగోబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. గిరిజనులతో కలిసి ప్రత్యేక వంటకాలు వండి అక్కడే భోజనం చేయనున్నారు. మహిళలతో కలిసి ఆర్టీసీ బస్‌లో ప్రయాణం చేస్తారు. తర్వాత అసిఫాబాద్ నుంచి నాందేడ్ వెళతారు. కాగా ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ గట్టిగా కృషి చేస్తోంది.

Updated Date - 2023-11-19T07:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising