ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tenth paper leakage case: ఈటలకు నోటీసులు.. 10న విచారణకు హాజరవుతా

ABN, First Publish Date - 2023-04-06T20:39:23+05:30

టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసు (Tenth paper leakage case)లో నోటీసుల పరంపర కొనసాగుతోంది. బీజేపీలో కీలకనేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మేడ్చల్‌: టెన్త్‌ పేపర్‌ లీకేజీ కేసు (Tenth paper leakage case)లో నోటీసుల పరంపర కొనసాగుతోంది. బీజేపీలో కీలకనేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etala Rajender)కు కమలాపూర్‌ పోలీసులు గురువారం సాయంత్రం నోటీసులు అందజేశారు. మేడ్చల్‌ జిల్లా (Medchal District) మేడ్చల్‌ మండలం పూడూరు ఓఆర్‌ఆర్‌ పక్కనే గల ఈటల నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. రేపు (శుక్రవారం) ఉదయం 11గంటలకు విచారణకు రావాలని ఎమ్మెల్యే ఈటలకు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు తెలిపారు. వరంగల్‌ డీసీపీ ఆఫీసులో హాజరుకావాలని పోలీసులు పేర్కొన్నారు. ఈటలతో పాటు ఆయన ఇద్దరు పీఏలు రాజు, నరేందర్‌లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు.

నోటీసులు అందాయి: ఈటల

ఎస్‌ఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో తనకు నోటీసులు అందాయని ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ మేరకు స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి ఈనెల 10వ తేదీన హన్మకొండ డీసీపీ కార్యాలయానికి ఉదయం 11గంటలకు హాజరవుతానని తెలిపారు. పోలీసుల ఎదుట హాజరవుతానని స్పష్టం చేశారు. తనకు వాట్సాప్‌ వాడటం రాదని, ఫోన్‌ వస్తే మాట్లాడటం తప్ప తనకింకేమీ తెలియదని తెలిపారు. తాను ఏవాట్సాప్‌ మెసేజ్‌లు ఓపెన్‌ చేయనని, తనకేదైనా అత్యవసరమైన సమాచారం వస్తే తన పీఏలే చూస్తారని ఈటల తెలిపారు.

Updated Date - 2023-04-06T20:48:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising