ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Road Accident: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి..

ABN, First Publish Date - 2023-09-10T12:15:27+05:30

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం, ఆలూరు స్టేజి వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివిధ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులని సమాచారం.

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం, ఆలూరు స్టేజి వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివిధ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులని సమాచారం. ప్రదీప్, సోనీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార్థులు ఆర్య, క్రాంతిలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన విద్యార్థులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని నగరంలోని మరో ఆసుపత్రి తరలించారు. శనివారం హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిగుట్టకు వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వీరందరూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా తెలియవచ్చింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-09-10T12:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising