ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics: జనగామలో ఆసక్తిగా మారిన రాఖీ పాలిటిక్స్

ABN, First Publish Date - 2023-08-31T15:29:16+05:30

జనగామలో రాఖీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. జనగామ ప్రధాన కూడళ్లలో రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. మరో వైపు పల్లాకు రాఖీ కట్టేందుకు హైదరాబాద్‌లోని పల్లా నివాసం

జనగామ: జనగామలో రాఖీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. జనగామ ప్రధాన కూడళ్లలో రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. మరో వైపు పల్లాకు రాఖీ కట్టేందుకు హైదరాబాద్‌లోని పల్లా నివాసం దగ్గర జనగామ నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. స్వయంగా మహిళలకు టిఫిన్ వడ్డించి, భారీ స్థాయిలో గిప్ట్‌లు ఇచ్చి పంపించారు. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు.

జనగామ టికెట్‌ను బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఈ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డే ఆశిస్తున్నారు. తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పెద్దలను కలిసి విన్నవించారు. ఇంకోవైపు ఈసారి పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా జనగామ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనగామ టికెట్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరీ ఈ టికెట్‌ను ఎవరికి కేటాయిస్తారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Updated Date - 2023-08-31T15:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising