పగిలిన గుండె
ABN, Publish Date - Mar 12 , 2024 | 12:56 AM
ఎస్కేయూ గెస్ట్ లెక్చరర్ మూర్తిరావు హోకలే హత్యను జీర్ణించుకోలేక.. ఆయన భార్య గుండె పగిలింది. మూర్తి రావు మృతి చెందిన కొన్ని గంటలకే ఆయన అర్ధాంగి శోభ(56) గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. దీంతో వారి కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. జేఎనటీయూ ఎదురుగా ఉన్న మూర్తి రావు హోకలే ఇంట్లోకి వెళ్లి ఆయన అల్లుడు ఆదిత్య ఆదివారం రాత్రి కత్తితో దాడి చేశారు.
భర్త హత్యను జీర్ణించుకోలేని శోభ
అనంతపురం క్రైం, మార్చి 11: ఎస్కేయూ గెస్ట్ లెక్చరర్ మూర్తిరావు హోకలే హత్యను జీర్ణించుకోలేక.. ఆయన భార్య గుండె పగిలింది. మూర్తి రావు మృతి చెందిన కొన్ని గంటలకే ఆయన అర్ధాంగి శోభ(56) గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. దీంతో వారి కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. జేఎనటీయూ ఎదురుగా ఉన్న మూర్తి రావు హోకలే ఇంట్లోకి వెళ్లి ఆయన అల్లుడు ఆదిత్య ఆదివారం రాత్రి కత్తితో దాడి చేశారు. దీంతో మూర్తిరావు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో భర్త మృతదేహం వద్ద విలపిస్తూ శోభ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు గుండెపోటు రావడంతో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాసేపటికే ఆమె మృతి చెందారు. దంపతులిద్దరూ గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. వారి పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరి జెడ్పీ హైస్కూల్లో శోభ టీచర్గా పనిచేస్తున్నారు. కుమారుడు ఉజ్వల్ హైదరాబాద్లో, కుమార్తె వైష్ణవి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
Updated Date - Mar 12 , 2024 | 12:56 AM