వైభవంగా కరిబసవేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం
ABN, Publish Date - Mar 12 , 2024 | 12:12 AM
మండలపరిధిలోని ఆమిదాలగొంది గ్రామంలో వెలసిన గురు కరిబసవేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవా రం వైభవంగా నిర్వహించారు.
మడకశిర రూరల్, మార్చి 11: మండలపరిధిలోని ఆమిదాలగొంది గ్రామంలో వెలసిన గురు కరిబసవేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవా రం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి గణపతిపూజ, గోపూజ, గంగపూజ, పలుహోమాలు, పూర్ణహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయం త్రం కరిబసవేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవాన్ని వైభంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
Updated Date - Mar 12 , 2024 | 12:12 AM