MLA MS RAJU : మడకశిర శాశ్వత అభివృద్ధే లక్ష్యం
ABN, Publish Date - Jul 11 , 2024 | 11:55 PM
నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పే ర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రా రంభించి ఆగిన పనులు పూర్తి చేయడంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వారు గురువారం పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృ హంలో విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతం చేయండి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
మడకశిరటౌన, జూలై 11: నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధే తమ లక్ష్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పే ర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రా రంభించి ఆగిన పనులు పూర్తి చేయడంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వారు గురువారం పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృ హంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర రైల్వే, భారీ నీటి పారుదల శాఖ సహాయ మంత్రి వి సోమణ్ణ శనివారం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని, మధ్యాహ్నం 12.30 గంటలకు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న గుం డుమల తిప్పేస్వామి ఇంటి వద్దకు రానున్నట్లు తెలిపారు.
అక్కడే సమావే శాన్ని ఏర్పాటు చేశామని, అందులో పలు సమస్యల పరిష్కారంపై చర్చించను న్న ట్లు తెలిపారు. గతంలో రాయదుర్గం నుంచి మడకశిర మీదుగా తుమకూరు వరకు మం జూరైన రైల్వేలైన నిర్మాణం త్వరిత గతిన పూ ర్తిచేసేందుకు హిందూపురం రోడ్డులో పనుల ను పరిశీలిస్తారన్నారు. అలాగే కుంచిటిగ వ క్కలిగులను, సాదర, లింగాయతు కులస్థుల ను ఓబీసీ జాబితాలో, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే పలు డిమాండ్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ల నున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గం శాశ్వత అభివృద్ధికి సంబంధిం చిన పలు ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. నియోజక వర్గంలోని ముఖ్యనాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jul 11 , 2024 | 11:55 PM