సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
ABN, Publish Date - Apr 25 , 2024 | 11:25 PM
పేదల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభిృవద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. వజ్రకరూరు మండలంలోని ధర్మపురి, చాబాల, ఛాయాపురం, పొట్టిపాడు, కమలపాడు, గూళ్లపాళ్యం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు.
ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్
ఉరవకొండ, ఏప్రిల్ 25: పేదల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభిృవద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. వజ్రకరూరు మండలంలోని ధర్మపురి, చాబాల, ఛాయాపురం, పొట్టిపాడు, కమలపాడు, గూళ్లపాళ్యం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. సైకిల్ గర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాల అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. టీడీపీ హయాంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఐదేళ్లలో వైసీపీ ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు. టీడీపీ నాయకులు మండల కన్వీనర్ నూతేటి వెంకటేశులు, నాగేంద్ర, దస్తగిరి, సుబ్బరాయుడు, ఎర్రిస్వామి, ఈశ్వర్, మనోహర్, విజయ్, మాబు, లాలూనాయక్ పాల్గొన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తేనే చెరువుకు నీరు
కూడేరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఇప్పేరు చెరువుకు నీరు వస్తాయని పయ్యావుల విక్రమ్సింహా అన్నారు. గురువారం కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపునకు తనయుడు పయ్యావుల విక్రమ్ సింహా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి సూపర్సిక్స్ పథకాలను వివరిస్తూ పయ్యావుల కేశవ్కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
Updated Date - Apr 25 , 2024 | 11:25 PM