ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vijayawada: ఆంధ్రజ్యోతి ఫొటో జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ.. వివిధ సంఘాల నిరసనలు

ABN, Publish Date - Feb 20 , 2024 | 07:06 PM

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో ఫొటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై వైసీపీ(YSRCP) కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడడాన్ని విజయవాడ జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. దాడికి నిరసనగా మంగళవారం అంబేడ్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.

విజయవాడ: అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో ఫొటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై వైసీపీ(YSRCP) కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడడాన్ని విజయవాడ జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. దాడికి నిరసనగా మంగళవారం అంబేడ్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"రిపోర్టర్‌ను ప్రాణాలు కోల్పోయేలా కొట్టారు. జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత. కొట్టిన వాళ్లు వీడియో లో స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదు. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి రావడం వల్లే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. అభ్యంతరాలు ఉంటే అడ్డు చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దాడులే మార్గం అయితే ... బూతులు తిట్టే వైసీపీ నేతలను ఎన్నిసార్లు కొట్టాలి. ఎమ్మెల్యేలు విచారం వ్యక్తం చేయకుండా రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. దాడులు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలి" అని నేతలు డిమాండ్ చేశారు.

Updated Date - Feb 20 , 2024 | 07:07 PM

Advertising
Advertising