చికెన్ ధరలు పైపైకి
ABN, Publish Date - Mar 01 , 2024 | 12:06 AM
చికెన్ ధర కొండెక్కి కూర్చి ంది. చికెన్ ధర వారం రోజుల్లో కిలోకు రూ.100 పెరిగింది. దీంతో ప్రస్తు తం కిలో రూ.300 వరకు పలుకుతుంది.
కిలో రూ.300 వరకు అమ్మకాలు
వారం రోజుల్లో కిలో రూ.80లు పెరిగిన ధర
తుని రూరల్/గండేపల్లి, ఫిబ్రవరి 29: చికెన్ ధర కొండెక్కి కూర్చి ంది. చికెన్ ధర వారం రోజుల్లో కిలోకు రూ.100 పెరిగింది. దీంతో ప్రస్తు తం కిలో రూ.300 వరకు పలుకుతుంది. చికెన్ధరలు గణనీయంగా పెరగడానికి కారణం కోళ్ళ ఉత్పత్తులు తగ్గడమే కారణమని కోళ్ల నిర్వాహకులు, వ్యాపారులు అంటున్నారు. మార్చి, ఏప్రిల్లలోకూడా ఇదే పరిస్ధితి కొనసాగేలా ఉంది. గుడ్డు ధర కూడా ఇలాగే కొనసాగుతుంది. బహిరంగ మార్కెట్లో రూ.5నుంచి రూ.7 వరకు అమ్మకాలు జరుపుతున్నాయి. కార్తీకమాసం సమయంలో కోడిమాంసం ధరలు భారీగా పడిపోవడం, కేజీ రూ.130కే అమ్మిన పరిస్ధితులు ఏర్పడటంతో అప్పట్లో కోళ్లఫారాల యాజమాన్యాలు నష్టాలు చవిచూడడంతోపాటు ఇతర జిల్లాల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ లక్షణాలు వెలుగుచూడడంతో కోళ్ల పెంపకందారులు పెంపకాన్ని ఒక్కసారిగా తగ్గించేశారు. మార్కెట్లో అయోమ యం పరిస్థితులు తలెత్తడంతో తల్లికోళ్ళను కూడా గిట్టుబాటు కాక అమ్మేశారు. ఫలితంగా ఉత్పత్తి తగ్గి కోళ్ళ కోరతతో మాంసానికి డిమా ండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో మార్కెట్లో చికెన్ ధరలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. హోల్సేల్గా కోళ్ళ ధర రూ.70 నుంచి రూ.80లకు వవచచ్చేదని అయితే ఈ వారం రోజుల వ్యవధిలోనే కిలో హోల్సేల్గా రూ.140 నుంచి రూ.150లకు పెరిగిందని, దీంతో మాసం కిలో రూ.280 నుంచి రూ.300లకు గిట్టుబాటు కాదని వ్యాపారులు అంటున్నారు.
Updated Date - Mar 01 , 2024 | 12:06 AM