‘విద్యా ప్రమాణాల పెంపునకు కృషి’
ABN, Publish Date - Feb 15 , 2024 | 11:54 PM
తొండంగి, ఫిబ్రవరి 15: ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ఆరవ తరగతి నుంచే ప్రణాళికా బద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం ఆయన కొత్తపెరుమాళ్ళపురం ఉన్నత పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. దిగువ తరగతులలో తెలుగు,ఆంగ్లంలో చదవడం రాయడం, గణితంలో చతుర్విత ప్రక్రియలు
తొండంగి, ఫిబ్రవరి 15: ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ఆరవ తరగతి నుంచే ప్రణాళికా బద్ధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం ఆయన కొత్తపెరుమాళ్ళపురం ఉన్నత పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. దిగువ తరగతులలో తెలుగు,ఆంగ్లంలో చదవడం రాయడం, గణితంలో చతుర్విత ప్రక్రియలు వచ్చిన వారి సంఖ్య తక్కువగా ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పదవతరగతి పైనే దృష్టి కేంద్రీకరించకుండా ఆరోతరగతి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పదో తరగతిపై సబ్జెక్టుల వారీగా సమీక్ష నిర్వహించారు. నాడు- నేడు పనులను పరిశీలించారు. ఎంఈవో షేక్ బాబ్జి, ప్రధానోపాధ్యాయులు సీహెచ్.సత్యన్నారాయణ, సీఆర్పీ మీరాసాహెబ్ పాల్గొన్నారు.
Updated Date - Feb 15 , 2024 | 11:54 PM