ఇసుకాసురులను ఇళ్లకు పంపే సమయం ఆసన్నమైంది!
ABN, Publish Date - Feb 27 , 2024 | 12:34 AM
ప్రజందరికీ ఉచితంగా అందాల్సిన ఇసుకను మింగేసిన వైసీపీ ఇసుకాసురులను ఇళ్లకు పంపే సమయం ఆసన్న మైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఫ పీలేరులో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
పీలేరు, ఫిబ్రవరి 26: ప్రజందరికీ ఉచితంగా అందాల్సిన ఇసుకను మింగేసిన వైసీపీ ఇసుకాసురులను ఇళ్లకు పంపే సమయం ఆసన్న మైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పీలేరు పట్టణం కొత్తపల్లె రోడ్డులోని రత్నం స్కూలు, రాజీవ్ నగర్ కాలనీ, బృందావనం నగర్, జీవీ నగర్ ప్రాంతాల్లో సోమ వారం ఆయన టీడీపీ, జనసేన శ్రేణులతో కలిసి ‘బాబు ష్యూరిటీ-భవి ష్యత్తు గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ రంగ కూలీలతో ఆయన ప్రత్యే కంగా మాట్లాడారు. వైసీపీ సర్కారు వచ్చాక ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తివేసి దానిని వ్యాపార వస్తువుగా మార్చివేసి అడ్డంగా దోచుకుంటూ కోట్లు గడిస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో ఆ రంగాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అనేక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని కిశోర్ వాపోయారు. ఇసుక దోపిడీతో నేడు పీలేరు నియోజకవర్గంలోని పీలేరు, కలికిరి, వాల్మీకిపురం మండ లాల్లోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడే దుర్భర పరిస్థితులు తలెత్తాయ న్నారు. . పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా అధికారిక ప్రకటన తరువాత తొలిసారి పీలేరుకు వచ్చిన ఆయనకు స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. కార్యక్రమంలో నాయకులు ఆర్బీఐ రమణారెడ్డి, యల్లెల రెడ్డప్ప రెడ్డి, బాబు, ఆబిద్ అలీ, షౌకత అలీ, చాన్ బాషా, రియాజ్, ఫిరోజ్, పురం రెడ్డమ్మ, సాధన, లక్ష్మీకాంతమ్మ, రమాదేవి, షమ, రెడ్డిముని, సురేశ్, నాగేంద్ర, నాగేంద్ర నాయక్, బాలకృష్ణ, జెట్టి దుర్గాప్రసాద్, సాయి, షౌకత, బాలా, కాలనీ శీనా, రమణ, సంపత, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 27 , 2024 | 12:34 AM