ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యువతను దగా చేసిన వైసీపీ

ABN, Publish Date - Feb 11 , 2024 | 10:58 PM

యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వైసీపీ పాలకులు దగా చేశారని దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెం కట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయకుండా నిరుద్యోగులను నిండాముంచారన్నారు.

మాట్లాడుతున్న వెంకట్‌

జనసేన పార్టీ నాయకుడు వెంకట్‌

దర్శి, ఫిబ్రవరి 11 : యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వైసీపీ పాలకులు దగా చేశారని దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెం కట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయకుండా నిరుద్యోగులను నిండాముంచారన్నారు. దొ నకొండలో పరిశ్రమ కారిడార్‌ ఏర్పాటును జగన్‌రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 90 రోజుల్లో ఇక్కడ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామని వెంకట్‌ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పటికీ పట్టించుకున్న వారే లేరన్నారు. అధికార పార్టీ పాలకు చేతగాని తనంతో తాగునీటి పథకాల న్నీ అధ్వానస్థితికి చేరాయని ధ్వజమెత్తారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అం దించే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో వంద వాటర్‌ ప్లాంట్‌లను సొంత నిధులతో ఏర్పాటు చేస్తానన్నారు. త్వరలోనే మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేసి ఐదువేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో నిలిచిపోయిన పనులను పునరుద్ధరిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీకి ప్రజలు పట్టంగట్టాలని వెంకట్‌ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జనసేన పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 10:58 PM

Advertising
Advertising