చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం
ABN, Publish Date - Mar 01 , 2024 | 11:41 PM
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నాయకులు తెలిపారు. శుక్రవారం జిల్లాలోని చోట్ల టీడీపీ నాయకులు పర్యటించారు. కార్యకర్తలు నియోజకవర్గాల ఇన్చార్జిలను కలిశారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నాయకులు తెలిపారు. శుక్రవారం జిల్లాలోని చోట్ల టీడీపీ నాయకులు పర్యటించారు. కార్యకర్తలు నియోజకవర్గాల ఇన్చార్జిలను కలిశారు.
‘సూపర్సిక్స్’ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: కళా
ఎచ్చెర్ల: ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరోసారి పదవీ బాధ్యతలు స్వీకరించడంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు తెలిపారు. శుక్రవారం రాజాంలోని క్యాంప్ ఆఫీస్లో ఎస్ఎంపురానికి చెం దిన టీడీపీ నేతలు కలిశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సూపర్సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించా రు. ఎస్ఎంపురం పంచాయతీ నుంచి మంచి మెజార్టీని తీసు కు వచ్చేలా కృషిచేస్తామని మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గొంటి నర్సింగరావు చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు సంపతిరావు గణపతిరావు, కోటి, సింహాచలం పాల్గొన్నారు.
టీడీపీకి అండగా నిలవాలి: అశోక్
సోంపేట: కళాసీ సంఘం టీడీపీకి అండగా నిలవాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్ కోరారు. శుక్రవారం సోంపేటలోని కళాసీ సంఘభవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ప్రతి సమయంలో కళాసీసంఘం టీడీపీకి అండగా ఉంటోందని, పార్టీ గెలుపులో ముఖ్యభూమిక పోషిస్తోందని తెలిపారు. సమావేశంలో కళాసీసంఘ అధ్యక్షు డు రెల్లలోకనాథం, తేజ, పి.దినేష్, టీడీపీ రాష్ట్రకార్యదర్శి సూరాడ చంద్రమోహన్, మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాస రావు, బీన ఆనంద్, చిత్రాడ శేఖర్ పాల్గొన్నారు.
మౌలిక సౌకర్యాల కల్పన సాధ్యం
కంచిలి: మౌలిక సౌకర్యాల కల్పన టీడీపీ ప్రభుత్వంలోనే సాధ్యమని ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. కంచిలి పరిధిలోని బలియాపుట్టుగ కాలనీలో రూ. 5.58లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. బీపీకాలనీలో రూ.1.5లక్షలతో ఏర్పాటుచేసిన తాగునీటి ట్యాంకును, బలియాపుట్టుగలో డ్రైనేజీ, చిన్నపాత్రపడలో చెరువు మెట్లు, పాత్రపడా, మఠం కంచిలిల్లో మంచినీటి ట్యాంకు, సీసీ రోడ్డును ప్రారంభించగా, దాకరాపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నాయకులు బంగారు కురయ్య, జగదీష్ పట్నాయక్, ఎంఎం పట్నాయక్, మద్దిల కేశవరావు, ఆనంద్, భాస్కరరావు, లండ లోకనాథం, జనసేన నాయకులు క్రాంతికుమార్, వైద్యులు సత్యం, రమణ, కె.కురయ్య పాల్గొన్నారు.
‘సూపర్సిక్స్’తో సంక్షేమం
కవిటి: టీడీపీ ఎన్నికల మేనిపేస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో మరింత సంక్షేమం అందుతుందని ఎమ్మెల్యే అశోక్ సతీమణి నీలోత్సల తెలిపారు.శుక్రవారం మండలంలోని డి.గొనపపుట్టుగ పంచాయతీలో ఇంటింటా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకుగ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు ఎన్నికల హామీలను తెలియ జేస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ అభ్యర్థులు బి.అశోక్, కె.రామ్మోహన్ నాయుడులను గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలుచేసే పథకాలకు సంబంధించి కరప త్రాలు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్వీ రమణ, పి.కృష్ణారావు, మణిచంద్రప్రకాష్, బి.చిన్నబాబు, బి.తిరుమలరావు పాల్గొన్నారు.
Updated Date - Mar 01 , 2024 | 11:41 PM