ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ పాలనలో భూములకు రక్షణ కరువు

ABN, Publish Date - Feb 26 , 2024 | 12:21 AM

వైసీపీ పాలనలో పాతపట్నంలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు.

ఆక్రమిత స్థలాన్ని పరిశీలిస్తున్న మాజీఎమ్మెల్యే కలమట

పాతపట్నం: వైసీపీ పాలనలో పాతపట్నంలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. స్థానిక ఆలాంధ్ర రోడ్‌లో కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలో చెరువు గర్భం ఆక్రమణలకు గురైందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన సదరు ప్రాంతాన్ని పరిశీలిం చారు. సుమారు 3 ఎకరాల వరకు చెరువు గర్భాన్ని చదును చేశారని రైతు నల్లి లక్ష్మణతో పాటు మరికొందరు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై కలమట తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. సర్వే నెంబర్‌ 18లో చెరువుగర్భం సుమారు మూడెకరాలను యంత్రాలతో చదును చేసి కబ్జాకు పాల్పడుతున్నారని, తక్షణం ఆక్రమిత ప్రాంతాన్ని స్వాధీనం చేసు కోవాలని కోరారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి అనుచరులు పాతపట్నంలో చేపడుతున్న ఆక్రమణలు పరాకాష్ఠకు చేరా యన్నారు. నాయకులు పైల లక్ష్మయ్య, సైలాడ సతీష్‌, రుంకు చలపతిరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:21 AM

Advertising
Advertising