ఆక్రమణల తొలగింపు
ABN, Publish Date - Mar 01 , 2024 | 11:42 PM
మెళియాపుట్టి మం డల కేంద్రంలో ఆక్రమణలను శుక్రవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. గురు వారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘అడిగేదెవరు.. ఆపే దెవరు’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి జేసీ నవీన్ స్పందించారు.
మెళియాపుట్టి: మెళియాపుట్టి మం డల కేంద్రంలో ఆక్రమణలను శుక్రవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. గురు వారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘అడిగేదెవరు.. ఆపే దెవరు’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి జేసీ నవీన్ స్పందించారు. ఆక్రమ ణలపై నివేదిక పంపాలని తహసీల్దార్ జానకమ్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆమె మెళియాపుట్టి, టెక్కలి రోడ్డులో ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - Mar 01 , 2024 | 11:42 PM